14, మార్చి 2013, గురువారం

ఇచ్ఛాపురం

సంబరానికి సన్నద్ధమవుతున్న స్వేచ్ఛాపురం
Swatchavathi స్వేచ్ఛావతి అమ్మవారి పేరు చెబితే ఇచ్ఛాపురమే గుర్తొస్తుంది. ఆంధ్రా ఒడిషాలతో పాటు దక్షిణ, ఉత్తర భారతానికి సరిహద్దు పట్టణం ప్రసిద్ధి గాంచిన ఇచ్ఛాపురం ఒక నాటి స్వేచ్ఛాపురమే. శ్రీ స్వేచ్ఛావతి అమ్మవారి కొలువున్న పట్టణంలో పుష్కరకాలం తరు వాత భారీ ఎత్తున ఉత్సవాలు జరిపించేందుకు గ్రామ పెద్దలు కంకణం కట్టుకున్నారు. 2001 లో రాష్ట్ర చరి త్ర పుటల్లో ప్రత్యేక స్ధానాన్ని దక్కించుకున్న ఇచ్ఛాపు రం అందుకు తలదన్నేలా మరో నాలుగింతల బడ్జెట్‌ తో పెద్దలు రంగంలోకి దిగారు. 2001 అనంతరం ప్రతీ ఐదేళ్లకొకసారి ఉత్సవాలు గ్రామశాంతి కోసం నిర్వహించ తలపెట్టినప్పటికీ పరిస్థితులు సహకరించ కపోవడంతో వాయిదా వేస్తూ వచ్చారు. పుష్కరకాలా నికి అమ్మవారి ఆమోదం లభించడంతో ఉత్సవాలతో శాంతింప జేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ దఫా ఉత్సాహంతో 108మంది ఉత్సవకమిటీ సభ్యులు న డుంబిగించారు. మార్చి 22న శుభరాట ద్వారా కార్య క్రమాలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఏప్రిల్‌ 22 నుండి 21 రోజులు పాటు ఉత్సవా లను నిర్వహించేందుకు అధికారుల నుండి అనుమతులు పొందేందుకు పెద్దలు సిద్ధమౌతున్నారు.

రక్తధారతో అమ్మవారి జననం
ఇచ్ఛాపురం గ్రామదేవతగా పూజలందుకుంటోన్న శ్రీ స్వేచ్ఛావతి అమ్మవారు రక్తధారతో జన్నించి నట్లు కథనం ప్రచారంలో వుంది. కొన్ని శతాభ్ధాలకు పూర్వమే అమ్మవారు ఈ గ్రామంలో వెలసినట్లు చెబుతున్నారు. పూర్వం ఈ ప్రాంతంలో కొన్నాళ్లు విపరీతమైన కరువుకాటకాలు ఏర్పడి, కలరా, మశూచి వ్యాధులు ప్రబలడంతో ప్రతీ వీధిలో చిన్నాలు, పెద్ద లు పెద్దసంఖ్యలో మృతిచెందేవారు. అప్పట్లో వేరేదారిలేక చాలా మంది ప్రజలు, గ్రామం, ఇళ్లు విడిచిపెట్టి ప్రాణభీతితో ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిపోయారు.

ఓ వ్యక్తి మాత్రం గ్రామం ఎడారిగా మారినప్పటికీ శ్రమను నమ్ముకుని దైవ భక్తితో అక్కడే వుండిపోయాడు. తనకున్న పొలాన్ని సేద్యం చేస్తుండగా ఒకనాడు నాగలి భూమిలో ఇరు క్కుంది. అతుక్కుపోయిన నాగలిని బయటకు తీసే ప్రయత్నించిన రైతు చెమటలు పట్టి భయాందోళనకు గురయ్యాడు. చుట్టుపక్కల వున్న రైతులను కేకలు వేసి సాయం చేయమని కోరగా వారు నాగలి ని బయటకు తీస్తుండగా చివరిభాగం నుండి రక్తం ధార గా చిమ్మడం మొదలుకావడంతో వారంతా భయంతో పరుగులు తీశారు. ఈ వింత చూసేందుకు వచ్చిన గ్రామస్ధులు నాగలిపై చేసే సాహసం చేయలేక, ఎద్దులను ట్లు విప్పి పంపేసి నాగలిని అక్కడే విడిచిపెట్టి వెనుదిరిగారు. అంతా భగవంతునిపై భారం వేసి ఆ రాత్రి నిద్రపోయారు.

ఓ గ్రామపెద్దకు ఆ రాత్రి కలలో బంగారుకాంతితో మెరుస్తూ అలంకార భూషితై , శంఖు, చక్ర, గదాపద్మ , ఖడ్గ శూలపాశ దండములతో, సింహవాహినై చిరునవ్వుతో ఓ దివ్యమంగళ స్వరూపం సాక్షాత్కరించింది. ‘పొలంలో రక్తం చిందించిన చోటనే, నేను శక్తిస్వరూపిణిగా, శ్రీ స్వేఛ్ఛావతి మాతగా ఆవిర్భవించి వున్నాని’ పలికింది. ‘ఇక మీరు భక్తిశ్రద్దలతో ఆరాధిస్తూ ప్రశాంతంగా, స్వేఛ్ఛగా, ఆరోగ్య సౌభాగ్యాలతో వెలగాలని దీవించి మాత అదృశ్యమైంది.

ఉదయాన్నే గ్రామపెద్ద లేచి కొంచెం భయం, ఆశ్చ ర్యం, ఆనందంతో విషయాన్ని గ్రామస్దులుకు తెలియ జేశాడు. దీంతో గ్రామస్దులు మేళతాళాలతో వెళ్లి పొలంలో నాగళి అతుకున్న చోట తవ్వగా అమ్మవారి విగ్రహాన్ని పోలిన రాయికి పెద్ద నాగలి గాటుతో రక్తంకారుతుండడం కన్పించింది. గ్రామస్దులు ఎంతో ధనవ్యయంతో చెక్కడపు శిలలతో, చక్కని శిల్పాలతో అక్కడే అమ్మవారికి ఆలయాన్ని నిర్మించారు. ఆ దేవికి స్వేచ్ఛావతిగా నామకరణం చేసి గ్రామదేవతగా ప్రతిష్ఠించారు. అక్కడ నుండి గ్రామానికి స్వేచ్ఛాపుర మని పిలవసాగారు. వాడుక లో నేటి ఇచ్ఛాఫురంగా పిలవబడుతోంది.

సంబరాల కోసం
సంబరాల నిర్వహణ కోసం గ్రామలు పలువురు గత ఏడాది భేటీ అయ్యారు. గత ఏడాదే నిర్వహించాలని భావించారు. కొన్ని అడ్డంకుల దృష్ట్యా 2013 కు వాయిదా వేశారు. నిధుల సమీకరణ కోసం తొలుత ప్రతీ దుకాణంలో హుండీలు ఏర్పాటు చేసి విరాళాల సేకరణకు నాంది పలికారు. సుమారు 11 నెలలు కాలంలో రూ. 7 లక్షల మేర విరాళాలు సమకూరాయి.

ఉప్పలవీధిలో అమ్మవారికి స్థానం
ఏప్రిల్‌ 22 రాత్రి అమ్మవారిని మంగళవాయిద్యాల నడుమ అత్యంత వైభవంగా పట్టణంలోని ఉప్పలవీధిలో మండపం పై అమ్మవారిని వుంచుతారు. ఆ వీధికి చెందిన ‘నందికి’ వంశస్దులు అమ్మవారి కి కొన్ని తరా లుగా సేవలు చేస్తుండడంతో ఆ ప్రాంతానికి ప్రాధాన్యత కల్పిస్తున్నారు. ఆ వంశసు ్ధలకు చెందిన ఓ మహిళ కు అమ్మవారి ని తలపై ఊరేగించే అవకాశం కల్పిస్తారు.

సంబరాలతో మరింత అభివృద్ధి
vallam-patiసంబరాలతో స్వేచ్ఛావతి అమ్మవారి కటాక్షంతో గ్రామం మరింత అభివృధ్ధి చెందు తుందని ఆశిస్తున్నాం. అమ్మవారికి సంబరాల కానుకగా బంగారు ముఖాన్ని సిద్దం చేసి సంబరాల నాటికి అలంకరించే ఆలోచన చేస్తున్నాం. అమ్మవారి బంగారు 44 గ్రాములతో పాటు దాతల నుండి ఒక్కో గ్రాము ద్వారా సేక రించి 350 గ్రాములతో తయారు చేసే లక్షంతో పనిచేస్తున్నాం. ఆలయంలో సిసి కెమరాలతో స్ట్రాంగ్‌ రూం ఏర్పాటుకు ప్రణాళిక సిద్దం చేశాం. అన్ని వర్గాలు సహ కరిస్తున్నారు.
వల్లంపాటి సుధీర్‌ కుమార్‌, ఉత్సవకమిటీప్రతినిధి





శాంతి స్వరూపిణి
Icha-(1)శ్రీ స్వేఛ్ఛావతి అమ్మవారు శాంతి స్వరూపిణి. శాంత స్వభావంతో భక్తులకు సుఖశాంతులు అందించే తల్లిగా కొలుస్తారు. చిన్నదేవాలయంగా వుండడంతో దాతల సాయంతో, భక్తుల విరాళాలతో అమ్మవారి ఆలయాన్ని 2003 లో అభివృద్ధి చేసి పునఃప్రతిష్ట చేశాం. ఇన్నేళ్లు సంబరాలు నిర్వహిస్తుం డడం గ్రామానికి ఎంతో శ్రేయస్కరం.
దుర్గాగురుస్వామి,నిర్వాహక కమిటీ ప్రతినిధి
| |

13, మార్చి 2013, బుధవారం

శ్రీకూర్మం

అపురూప శిల్పకళా శోభితం శ్రీకూర్మం
మత్స్యావతారుడైన శ్రీ మహావిష్ణువుకు ఈ భూమిపై గల ఏకైక దేవాలయం శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకూర్మం. అందుకే దీనికి ఎనలేని విశిష్టత ఉంది. మహావిష్ణువు అవతారాల్లో రెండోదైన కూర్మావతారం రూపంలో దైవం ఈఆలయంలో కొలువై ఉంటుంది. అమృతానికై దేవదానవులు క్షీరసాగరమధనం చేయడానికి మంధర పర్వతాన్ని కవ్వంగా, వాసుకిని తాడుగా ఉప యోగించారు. ఆసమయంలో వత్తిడికి లోనైన మంధర పర్వతం క్షీరసాగరంలోకి మునిగిపోతుంటే శ్రీమహావిష్ణువు కూ ర్మావతారాన్ని ధరించి పర్వతం కింద ఆధారంగా నిలచి అమృత మధనానికి సాయం చేశాడు. అటువంటి ఆపురూప అవతా రం .  ఈ ఆలయంలో ఈనెల 25నుంచి 27వ తేదీ వరకూ అత్యంత వైభవంగా డోలోత్సవాలను నిర్వహిస్తున్నారు.
14Feaf

ఆలయ విశిష్టత
శ్రీకాకుళం జిల్లా, గార మండలం శ్రీకూర్మం గ్రామంలో శ్రీకూర్మనాథ స్వామి ఆలయం విశాల ప్రాంగణంలో నెలకొని ఉంది. పెద్ద ప్రాకారా నికి వెలుపల ‘శ్వేత పుష్కరిణి’ ఉంది. క్రీస్తు శకం నాలుగో శతాబ్ధి నాటికే ఈ ఆలయం ఇక్కడ ఉందని చారిత్రిక ఆధారాలు స్పష్టం చేస్తు న్నాయి. ఈ ఆలయంలోని ప్రతీ శిల్పం ఒక అపూరూప కళాఖండంగా చెప్పవచ్చు. ఎంతో మంది రాజులు వేసిన శిలాశాసనాలు శిథిలమై పోకుండా ఇప్పటికీ లభిస్తాయి. ఇవి కళింగాంధ్ర చరిత్రకు అమూల్యా ధారాలుగా నిలుస్తాయి. అత్యద్భుతమైన వాస్తు కళతో ఆలయం అలరా రుతూ ఉంటుంది. ఈ ఆలయ మండపంలోని 108 రాతి స్తంభాలు అన్నీ ఏకశిలతో రూపు దిద్దుకున్నవే. ఒకదానికి ఒకటి పోలిక లేకుండా విభిన్నంగా వీటిని శిల్పులు అత్యంత రమ ణీయంగా మలిచారు.

14Feaప్రతీ ఆలయంలోనూ గర్భగుడిలో ఎదురుగా మూలవిరాట్‌ ఉంటే ఈ ఆలయంలో మాత్రం గర్భ గుడిలో ఎడమవైపు గోడ మూలగా శ్రీకూర్మనాధుని ఆవతారంలో శ్రీమహావిష్ణువు భక్తులకు సాక్షాత్కరి స్తారు. భక్తులు నేరుగా గర్భగుడిలోకి వెళ్తే అడుగు ఎత్తు, ఐదడు గుల పొడవు, నాలుగడుగులు వెడల్పు కొలతలు గల రాతిపీఠం పై కూర్మనా థస్వామి దర్శనమిస్తారు. రెండున్నర అడుగుల పొడవు, అడుగు ఎత్తులో మొదట తల మధ్యలో శరీరం చివరిగా పశ్చిమా భిముఖంగా తోకతో మూడు భాగాలుగా శ్రీకూర్మం కన్పిస్తుంది. మధ్య తక్కు వ ఎత్తులో శిరస్సుకలిపి ఒకటిగా కన్పిస్తా యి. చివర తాటిపండు పరిమాణంలో తోక వేరే శిలగా ఉంటుంది. విగ్రహమంతా దట్టంగా గంధపు పూతను పూసి అలంకరి స్తారు. గర్భగుడిలోకి భక్తులు నేరుగా వెళ్లడం వైష్ణవ సంప్రదాయానికి భిన్నమైనా ఇక్కడ మాత్రం నేరుగా గర్భగుడిలోనే స్వామిని దర్శించుకోవచ్చు.

స్థల పురాణం
13sklmp-13పూర్వం శ్వేత చక్రవర్తి ఈప్రాంతాన్ని పరిపాలించేవాడు. ఆయన భార్య విష్ణు ప్రియ. ఆమె విష్ణు భక్తురాలు. ఆమె ఏకాదశి ఉపవాస వ్రతంలో ఉన్న సమయంలో ఆమెపై కామాన్ని పెంచుకున్న చక్రవర్తి ఆమెను బలవంతం చేయసాగాడు. ఇది సమ యం కాదని ఆమె వారించింది. ఆయినా సరే రాజు మొండి పట్టుదలను వీడలేదు. ఆమె శ్రీమహావిష్ణువును ప్రార్థించింది. ఆమె ప్రార్థనకు ప్రసన్నుడైన విష్ణువు వారిద్దరి మధ్య తన ప్రాదోద్భవ గంగను ప్రవహింపజేశాడు. అది నదిగా మారి వేగంగా ప్రవహించింది. అందులో శ్వేత చక్రవర్తి కొట్టుకుని పోతుండగా ఆమె కూడా అతని వెంట వెళ్లింది. శ్వేత గిరిపైకి రాజు, అతని భార్య చేరుకున్నారు. ఆసమయంలో నారద మహర్షి ప్రత్యక్షమై రాజుకు శ్రీకూర్మ మంత్రోపదేశాన్ని చేశాడు. ఈమంత్ర జపం చేయగా విష్ణుమూర్తి కూర్మ రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఈతపస్సు వలన శ్వేత చక్రవర్తి శరీరం అప్పటికే కృశించి పోయింది. దీంతో కూర్మదేవుడు దిక్కులు పిక్కటిల్లేలా హూంకరించాడు.

13sklmp-16ఈశబ్ధానికి తట్టుకోలేక శ్వేతాచలం అనే ఈపర్వతం భూమిలోకి కుంగిపోయింది. అప్పటినుంచి ఇది ప్రజలకు నివాసయోగ్యంగా మారింది. మహావిష్ణువు తన సుదర్శన చక్రాన్ని వదిలితే అది భూమిని చీల్చిన చోట ఒక సరస్సు ఏర్పడింది. ఇందులో రాజు స్నానం చేసి సంపూర్ణారోగ్యాన్ని పొం దాడు. ఈ సరస్సుకు శ్వేత పుష్కరిణి అనే పేరు వచ్చింది. అప్పటి నుంచీ కూర్మనాధుడు ఇక్కడే స్థిర నివాసంలో ఉండిపో యాడు. శ్రీమహావిష్ణువుతో పాటు మహాలక్ష్మి కూడా ఇక్కడే కొలువు దీరింది. ఇది జరిగిన కొంతకాలం తర్వాత శ్వేత పుష్క రిణిని చూసి ఒక కోయరాజు విస్మయానికి గురైతే శ్వేత మహారాజు ఈ వృత్తాంతాన్ని వివరించాడు. ఎంతో సమ్మోహితుడైన కోయరాజు ఆ కోనేటికి గట్లు, మెట్లు నిర్మించాడు. అతడు అక్కడికి పడమర గల సంపంగి మహర్షి ఆశ్రమంలో ఉండి స్వా మిని ఆరాధించేవాడు. తనకు స్వామి ఎల్లప్పుడూ దర్శనమిస్తూ ఉండాలని కోరుకోవడంతో శ్రీ కూర్మనాథుడు పడమటివైపు ముఖం తిప్పుకొని ఉండిపోయాడట.

13sklmp-15అందువల్లే ఆలయంలో శ్రీకూర్మనాథుని విగ్రహం పశ్చిమాభిముఖంగా దర్శనమిస్తూ ఉంటుంది. ద్వాపర యుగంలో శ్రీకాకుళంలో ఉమారుద్రకోటేశ్వర లింగ ప్రతిష్ట చేసిన బలరాముడు శ్రీకూర్మం వచ్చాడు. అక్కడ క్షేత్రపాలకుడైన భైరవుడు అతనిని అడ్డగిం చాడు. దాంతో అతడు భైరవుని పై ఆగ్రహంతో ఆతనిని గిరగిరా తిప్పి విసిరేశాడు. ఇది తెలిసిన కూర్మనాధ స్వామి బలరామునికి దర్శన భాగ్యాన్ని కలిగించాడు. ఆయినప్పటికీ తనకు జరిగిన అవమానంతో ఆగ్రహాగ్ని చల్లారని బలరాముడు ‘కూర్మావతారం’లో ఆలయం భూమి పై మరెక్కడా ఉండకూడదని శపించాడు. అందువల్లే ప్రపంచంలోనే ఇది ఏకైక కూర్మనాధస్వామి ఆలయంగా విరాజిల్లుతోంది. ఈఆలయా నికి రెండు ధ్వజ స్తంభాలు ఉండడం మరో ప్రత్యేకత. శ్రీకూర్మంలోని పుష్కరిణి అడుగుభాగం నీరుతో కలిసిన మట్టి తెల్లగా తళతళలాడుతూ ఉండడం విశేషం. ఒక మహర్షికి శ్రీకృష్ణుడు గోపికలతో సహా వచ్చి ఈ పుష్కరిణీలో జలక్రీడలాడుతూ కన్పించాడట. అందు వల్లే ఆ పుష్క రిణిలోని మట్టి తెల్లగా మారిందని చెబుతారు. దీనిని ‘గోపీ చందనం’ అని కూడా అంటారు.

ఈమట్టితో తిరునా మాలు దిద్దు కోవడం అత్యంత శుభప్రదమని భక్తుల విశ్వాసం.శ్రీకూర్మంలోని పాతాళ సిద్ధేశ్వరున్ని దర్శించుకున్న తర్వాతే శ్రీకూర్మనాథ స్వామిని దర్శించాలని అం టారు. హటకేశ్వరుడు, కర్పూరేశ్వరుడు, కోటీశ్వరుడు, సుందరీశ్వరుడు, పాతా ళసిద్ధేశ్వరుడు శ్రీకూర్మక్షేత్రానికి క్షేత్ర పాలకులు. ఈ ఆలయాన్ని భగవత్‌రామానుజులు, కృష్ణ చైతన్యుడు వంటి ప్రముఖు లెందరో సందర్శిం చి కూర్మనాథుని దర్శనాన్ని చేసుకున్నారు.అన్ని రకాల వైష్ణవ క్షేత్ర ఉత్స వాలు ఇక్కడ జరుగుతాయి. ఈ నెల 25వ తేదీనుంచి 27వ తేదీ వరకూ డోలోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇందులో మొదటిరోజు కామదహనం, రెండో రోజు పడియ, మూడో రోజు డోలోత్సవాన్ని నిర్వహిస్తారు.శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి కేవలం 12 కిలోమీటర్ల దూరంలో ఉ న్న ఈఆలయానికి వాహన సదుపాయం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది. మార్గమధ్యం లోని అరసవల్లి శ్రీసూర్యనారా యణ స్వామిని దర్శించుకుని భక్తులు శ్రీకూర్మం చేరుకోవచ్చు.

---బెందాళం కృష్ణారావు, (మేజర్‌ న్యూస్‌ ప్రతినిధి- శ్రీకాకుళం)