16, ఫిబ్రవరి 2013, శనివారం

సూర్య జయంతి

ఆదిత్య హృదయం
శ్రీ సూర్యనారాయణుడు కనిపించే ఏకైక దైవం... సమయ పాలనా చక్రవర్తి... ఆరోగ్యదాత... అభయప్రదాత... అన్న పేర్లున్నవాడు. రాత్రిపగళ్లతో చీకటివెలుగులను పంచడంలో సిద్ధహస్తుడు. భాస్కరుడు ప్రసరించే సహస్ర కిరణాలు మన శరీరంలోకి ప్రవేశించి అనారోగ్యం లేకుండా కాపాడు తాయి. సూర్యభగవానుడు ఉదయం బ్రహ్మస్వరూపంగా, ప్రకృతిలో జీవాన్ని నింపి, మహే శ్వరునిగా మధ్యాహ్నం తన కిరణాల ద్వారా సృష్టియొక్క దైవిక వికారాలను రూపు మాపి, సాయం కాలం విష్ణురూపంగా భాసిల్లే తన కిరణాల వెలుగును మనోరంజకంగా ప్రసరింపజేస్తూ ఆనందాన్ని కలిగించే ప్రత్యక్షదైవం. అదితికశ్యపులకు పుట్టిన సూర్యభగవానుడి జన్మదినమే రథసప్తమి. ఈ సందర్భంగా సూర్య ప్రత్యేక కథనం...

sklmp12సూర్యుడు లేని ప్రపంచాన్ని ఊహించలేం. సూర్యుడు కర్మసాక్షి. మాఘశుక్ల సప్తమి నాడు తొలిసారిగా ఈ భూమికి కనిపించి రథమెక్కాడట భాస్కరుడు. ఈరోజు ఆకాశంలో నక్షత్రాలు రథాకారం దాల్చుతాయి. అందుకే రథసప్తమి అయిందని పురాణాలు అంటున్నాయి. సూర్యు డు ఆధ్యాత్మిక విశేషమే కాదు... భౌతిక, ఖగోళ, శారీరక ప్రాముఖ్యం కలిగిన గ్రహనాయకుడు కూడా. సమస్త మాన వాళి ఆరోగ్యం- భాస్కర ప్రసాదంగా చెబుతారు. విదేశీయు లు కూడా సూర్యస్నానం చేసేది అందుకే. ఉదయకాలం పూట కాసేపు సూర్యకాంతికి ఎదురునిలచోవడంలో అంత రార్ధం ఆరోగ్యసూత్రమే. మన సంప్రదాయాల్లోని సంధ్యా వందన నియమం అందుకేనని అంటారు.

ఆయా సమ యాల్లో సూర్యకిరణాలు ఆరోగ్యాన్నందించేవిగా భావించడం వల్లే... సంధ్యావందన నియమాన్ని విధిగా ఆచరించ మని చెబుతోంది భారతీయశాస్త్రం. రథసప్తమి రోజున సూ ర్యభగవానుడిని దర్శించుకుంటే సర్వపాపాలు తొలగి పో యి పుణ్యఫలం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. హిందువులు మాఘ శుద్ధ సప్తమి రోజు రథసప్తమి పండుగ జరుపుకుంటారు. ఇతర మాసాలలోని సప్తమి తిథులకన్నా మాఘమాసమందలి సప్తమి బాగా విశిష్టమైనది. సుర్యుని గమనం ఏడు గుర్రాలు పూన్చిన బంగారు రథం మీద సాగుతుందని వేదం ‘హిరణ్యయేన సవితారథేన’ అని తెలు పుతుంది. సూర్య గమనం ప్రకారం ఉత్తరాయనం, దక్షిణా యనం అని రెండు విధాలుగా ఉంటుంది. ఆషాఢమాసం నుండి పుష్యమాసం వరకు దక్షిణాయనం.

సూర్యరథం దక్షి ణాయనంలో దక్షిణ దిశగా పయనిస్తుంది. తరువాత సూ ర్యుడు మకరరాశి ప్రవేశం ఉత్తరాయన ప్రారంభ సూచకం రథసప్తమి అని పేరు వచ్చింది. అందుకే ఈరోజు పవిత్ర దినంగా భావించి భారతీయులు సూర్యుని ఆరాధిస్తారు. ‘భా’ అంటే సూర్యకాంతి, ‘రతి’ అంటే సూర్యుడు, కావున సూర్యుని ఆరాధించువారు అందరూ భారతీ యులు. ‘భారతీ’ అంటే వేదమాత. వేదమాత నారా ధించువారు కూడా భారతీయులే.

అరసవల్లి ఆదిత్యుడు...
sklmp19అజ్ఞాన తిమిరాన్ని కోటికోట్ల అరుణ కిరణాలతో చెల్లాచెదురు చేసి సమస్త జీవరాసులను మేల్కొలిపే ఆదిదేవుడు ఆదిత్యుడు. అటువంటి సూర్యభగవానుడు మూర్తీభవించిన దైవంగా శ్రీకాకుళం పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో అరసవల్లిలో నిత్యపూజలు అందుకుంటున్నాడు. ప్రపంచంలో నిత్యారాధనలు జరిగే ఏకైక సూర్యదేవాలయం ఇదొక్కటి మాత్రమే కావడం ఈ ఆలయ విశిష్టతను చాటి చెబుతోంది. ఆరోగ్య ప్రదాతగా నిలచిన ఆదిత్యుని జయంతి రథసప్తమినాడే జరుగుతుంది.

చరిత్ర పుటల్లో అరసవల్లి...
చరిత్ర పుటలను తిరగేస్తే అరసవల్లిలోని శ్రీ సూర్యదేవాల యాన్ని కళింగ రాజ్య పాలకులు తూర్పు గంగరాజులలో ప్రముఖుడైన దేవేంద్ర వర్మ క్రీస్తు శకం 545లో నిర్మించి నట్టు తెలుస్తోంది. ఆ తరువాత ఆయన వారసుడు ఒకటో దేవేంద్రవర్మ క్రీస్తు శకం 648లో సూర్యగ్రహణ సమయా న ఆదిత్య విష్ణుశర్మ, భానుశర్మలనే బ్రాహ్మణులకు అరస వల్లితో పాటు మరికొన్ని గ్రామాలను దానం ఇచ్చినట్టు ఆలయ పరిసరాల్లోని శాసనాలు స్పష్టం చేస్తున్నాయి. అనంతరం క్రీస్తు శకం 1077- 1150 సంవత్సరాల మధ్య జీవించిన అనంతశర్మ చోడగంగ దేవ రాజు సూర్యదేవునికి, శ్రీకూర్మ నాధునికి కొంతభూమి దానం చేసినట్టు అరసవల్లిలో దొరికిన శాసనాల ద్వారా తెలుస్తోంది. క్రీస్తు శకం 1609 నాటి శాసనంలో అరసవల్లిలో ఓ విద్యాలయం విద్యార్థులకు ఉచిత భోజన వసతితోపాటు చెరువు తవ్వకానికి భూదానం చేసినట్టు తెలిపారు. క్రీస్తు శకం 1434లో తూర్పుగంగ వంశం అంతరించినంత వరకు ఆదిత్యుడికి నిత్య పూజలు కొనసాగించారు.

ఆలయ నిర్మాణం జరిగిందిలా...
sklmp16అరసవల్లిలో సూర్యదేవాలయం నిర్మాణం గంగరాజుల్లో ఒకరైన దేవేంద్రవర్మ హయాంలో జరిగింది. కళింగ దేశ రాజధా నిగా శ్రీముఖలింగం ఉన్న రోజుల్లో ఇప్పిలి అక్కన్న, సూరప్ప అనే సోదరులు రాజు దర్శనానికి వెళ్లి, తమకు సూర్యదేవుడు కలలో కనిపించి కొన్ని వివరాలు చెప్పారని విన్నవించారు. ఆ సోదరుల దైవభక్తిపై ఎంతో నమ్మకంతో వారిని అరసవల్లి సూర్యదేవాలయానికి అర్చకులుగా దేవేంద్రవర్మ నియమించినట్టు కొన్ని రచనల ఆధారంగా తెలుస్తోంది. కృష్ణా తీర ప్రాంతానికి చెందిన ఈ సోదరులు శ్రీముఖలింగం వస్తున్నప్పుడు వంశధార నదిలో ఒక తాళపత్ర గ్రంధం దొరికిందని, అందులో సూర్యదేవుని పూ జా విధానాలు ఉన్నాయని వారు మహరాజుకు తెలిపినట్టు చరిత్ర చెబుతుంది.

వారి వారసులే ఇప్పటికీ ఆలయ అర్చకులుగా కొనసాగుతున్నారు. గంగ వంశరాజులు తరువాత గజపతులు అరసవల్లితో పాటు ఉత్తరాంధ్ర ప్రాం తంలోని ఆలయాలను సంరక్షించారు. క్రీస్తు శకం 1599 లో హజరత్‌ కులీకుతుబ్‌షా శ్రీ కూర్మం వరకూ దండయా త్ర జరిపి అరసవల్లి ఆలయాన్ని ధ్వంసం చేసినట్టు సౌత్‌ ఇండియన్‌ ఇన్‌స్క్రిప్షిన్స్‌ 5వ సంపుటం ఆధారంగా తెలుస్తోంది. ఆ తరువాత ఏ ప్రాముఖ్యతా లేని ఈ ఆలయాన్ని 1778లో యలమంచిలి పుల్లాజీ పంతులు పునరుద్దరించారు. ఆ సమయానికి నల్లని గ్రానైట్‌ శిలతో రూపొందించిన మూలవిరాట్‌ విగ్రహం తప్ప మరే అవశేషం మిగిలి లేదు. అలా కాలక్రమంలో యిప్పిలి జోగారావు ఆలయ ధర్మకర్తగా ఉన్న సమయంలో సారవకోట మండలం అలుదు నివాసి వరుదు బాబ్జీరావు ఆదిత్య ఆలయాన్ని అందంగా తీర్చిదిద్దారు.

స్థల పురాణం...
sklmp24ప్రాచీన చరిత్రలో విశిష్టతకు చిరునామాగా నిలిచిన సూర్యనారాయణస్వామి ఆలయానికి దేశంలోని అన్ని ఆలయాల వలే స్థల పురాణం కూడా వుంది. స్థల పురాణాలకు వేదికైన స్కంధ పురాణాలలో ఈ ఆలయాన్ని దేవేంద్రుడు నిర్మించినట్టు చెబుతారు. ఆయన తన వజ్రాయుధంతో తవ్విన చెరువునే ఇంద్రపుష్కరిణిగా పిలుస్తారు. ఆ చెరువులో దొరికిన సూర్యభగవానుడి విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్టించారని స్కంధ పురాణం చెబుతోంది. నాగావళి నదీ తీరంలో బలరాముడు ప్రతిష్టించిన ఉమారుద్ర కోటేశ్వరస్వామిని దర్శించడానికి దేవేంద్రుడు రాగా, తన అనుమతి లేకుండా అతడు వచ్చినందుకు నంది కాళ్లతో తన్నిందని, దాంతో దేవేంద్రుడు అరసవల్లిలో పడ్డాడని అంటారు. నంది ఇచ్చిన శాపవిమోచనం కోసం దేవేంద్రుడు అరసవల్లిలో ఆలయ నిర్మించాడని మరో కథనం ప్రచారంలో వుంది.

సూర్యజయంతే రథసప్తమి...
సూర్యుడు మకరరాశిలోని ప్రవేశించిన తరువాత మాఘమాస శుద్దసప్తమిని రథసప్తమిగా పేర్కొంటారు. ఈ సప్తమి రోజు సౌరకుటుంబానికి కేంద్రమైన సూర్యుడు ఉద్భవించినట్టు చెబుతారు. సూర్యోదయాన్నే... ‘సప్తసప్తమహాసప్త’ శ్లోకాన్ని జపిస్తూ స్నాన మాచరిస్తే విశేష ఫలితాలు ఉంటాయని ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ చెబుతున్నారు. ఇంద్ర పుష్కరణిలో భక్తులు తలపై జిల్లేడు ఆకులు, రేగుపండ్లు, నువ్వులు పోసుకోని మూడుసార్లు అభ్యంగన స్నానాన్ని ఆచరిస్తే పునర్జన్మ వుండదని అనాదిగా వస్తున్న నమ్మకం. రథసప్తమి రోజున స్ర్తీ సాంగత్యాన్ని, తైలం, మాంసాహారాన్ని ఎవరు త్యజిస్తారో వారికి సూర్యలోకం ప్రాప్తిస్తుందని చెబుతారు. స్వామి నిజరూప దర్శన పూజలతో భక్తులకు నవగ్రహ దోష నివృత్తి జరిగి ఆరోగ్య ఐశ్వర్యాలు సమకూరుతాయని నమ్మకం. అందువల్లే రథసప్తమి రోజున లక్షలాది మంది భక్తులు సూర్యదర్శనం కోసం తరలివస్తారు.

రథసప్తమి పూజలివిగో...
sklmp8అరసవల్లిలో వెలసిన ఆదిత్యుని సన్నిధిలో రథసప్తమి రోజు ఉదయం మహా అభిషేక సేవ, పంచామృతాలు, సుగంద ద్రవ్యాలతో మూలవిరాట్‌కి మహా అభిషేకం జరుగుతుంది. ఈ రోజున స్వామివారి దర్శనం వల్ల ఈ జన్మలో జన్మంతరాలలో మాటలు, చేతలు, దృష్టిదోషం వల్ల చేసిన పాపాలు, ఏడు జన్మల పాపాలు నశిస్తాయని నమ్మకం. భక్తులకు ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలు సమకూరుతాయని పురాణాలు చెబుతున్నాయి. రథసప్తమి రోజు ఆవు పేడతో తయారు చేసిన పిడకలతో మట్టిపొయ్యి మీద బియ్యం, పాలు, పంచదార లేదా బెల్లంతో తయారుచేసిన క్షీరాన్నాన్ని వండాలి. పందిరి చిక్కుడు ఆకుల మీదగాని తెల్ల జిల్లేడు ఆకుల మీదగాని ఆ క్షీరాన్నాన్ని ఉంచి స్వామివారికి నైవేద్యం పెట్టాలి.

ఏకభుక్తం (ఒంటిపూట) చేస్తూ ఆ ప్రసాదాన్ని స్వీకరించడం వల్ల శరీరంలో ఉన్న ఉబ్బసరోగాలు, శ్వాసకు సంబంధించిన రోగాలు, నరాల వ్యాధులు నశిస్తాయని పురాణాల్లో పేర్కొన్నారు. తెల్లజిల్లేడు, పందిరి చిక్కుడు ఆకులకు, రేగు పళ్లకి, సౌరశక్తిని నిలువ చేసే శక్తి ఎక్కువగా వుంటుంది. వీటిపై ఉంచిన ప్రసాదాన్ని భుజించడం వల్ల అన్ని వ్యాధులు నశిస్తాయని ఆయుర్వేదం చెబుతోంది. అలాగే రథసప్తమి రోజున శిరస్సు మీద, భుజాలు మీద తెల్ల జిల్లేడు ఆకులు, రేగుపళ్లు పెట్టుకొని స్నానం చేయడం వల్ల దీర్ఘకాల వ్యాధులు నయమవుతాయి. సూర్యజయంతి రోజున ఎర్ర చందనం (రక్తచందనం) అష్టదళ పద్మం వేసి (8 ఆకులమీద) సూర్యనారాయణ స్వామిని ఆవాహనం చేసి ఉపచార పూజలు చేయాలి.

రాగి పాత్రలో గరిక, పాలు, ఎర్రచందనం, మందార పువ్వులు కలిపిన పదార్థంతో సూర్య నారాయణ స్వామికి ఎదురుగా నిలబడి ఆర్ఘ్యం ఇస్తే స్వామి సంతృప్తి చెందుతారని, భక్తులకు భోగభాగ్యాలిచ్చి వచ్చే జన్మలో ఎటువంటి రోగాలు దరిచేరకుండా దీర్ఘాయిష్సు ప్రసాదిస్తారని నమ్మకం. భక్తులు మరణానంతరం సూర్యలోకం చేరుతారని పద్మ, బ్రహ్మ పురాణం, సౌరపురాణాలు చెబుతున్నాయి.

ఆదిత్యునికి నామాలెన్నో...
‘ఆరోగ్యం బాస్కరాధిచ్చేత్‌’ అని మాతృ పురాణం లో, ‘దివే శం సుఖార్ణ’ అని స్కందపురాణంలో, ‘తేజ స్నామో విభా వసు’ అని శ్రీమద్భాగవతంలో, ‘ఆదిత్య హృదయం పారా యణం సర్వశత్రు వినాశన’ అని రామాయణంలో శ్రీసూ ర్యభగవానుని ప్రస్తుతించారు. అంతటి మహిమాన్వితుడు, ప్రత్యక్షదైవం, ఆరోగ్య ప్రదాత, గ్రహరాజు, త్రిమూర్తి స్వరూపుడైన సూర్యభగవానుని మాసానికో పేరుతో పిలు స్తారు. అంటే 12 నెలలకు పన్నెండు పేర్లు... చైత్రమాసం లో ‘మిత్ర’ అని, వైశాఖంలో ‘రవి’, జ్యేష్టంలో ‘సూర్య’, ఆషాడంలో ‘వాసు’, శ్రావణంలో ‘ఖగ’, భాద్రపదంలో ‘పూష’, ఆశ్వయూజంలో ‘హిరణ్యగర్భ’, కార్తీకంలో ‘మరీచ’, మార్గశిరంలో ‘ఆదిత్య’, పుష్యంలో ‘సవిత్రు’, మాఘంలో ‘అర్క’, ఫల్గుణంలో ‘భాస్కరుడు’ అని పిలుస్తారు. భారతదేశంలో సూర్యభగవానునికి నిత్యపూజ, అర్చన జరిగే దేవాలయం అరసవల్లి మాత్రమే.

అపురూపం ఆదిత్య స్వరూపం...
అరసవల్లిలో వెలసిన ఉషా ఛాయా పద్మినీ సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయంలో ప్రత్యేకత లేని ది అంటూ ఏది లేదు. స్వామివారి దేవాలయం, సూర్య కిర ణాలు, ఇంద్ర పుష్కరిణికి ఎంత ప్రాధాన్యం ఉందో స్వామి వారి విగ్రహానికి అంతకు మించిన ప్రాధాన్యత ఉంది. స్వామివారిని కృష్ణ శిలతో కళాత్మకంతో తీర్చిదిద్దిన ఏక శిలా విగ్రహం ఇక్కడ వుంది. దీనికి అరుణ శిల అని కూడా ప్రసిద్ధి. దీనికి కారణం మూల విరాట్‌ను అరుణ అనే ప్రత్యేకమై శిలలో దేవ శిల్పి విశ్వకర్మచే చెక్కించారు.

ఆదిత్యునికి ఆరుణ శోభ...
sklmp7సకల జీవులకు ప్రత్యక్ష దైవమైన ఆదిత్యుడు ప్రతీ ఏడాది అక్టోబరు, మార్చి నెలలో అరుణ శోభను సంతరించుకుంటాడు. సూర్యుడు ఉత్తరాయణం నుంచి దక్షిణాయణంలోకి, దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం లోకి మారే సందర్భాలలో సూర్యకిరణాలు స్వామివారి ధృవమూర్తిని తాకుతాయి. ఆ సమయంలో బాలభాను ని లేలేతకిరణ స్పర్శకు ఆదిత్యుడు బంగారు ఛాయలో మెరిసిపోతూ అరుణశోభలో భక్తులకు దర్శనమిస్తాడు.

ప్రతీ ఏటా మార్చి 7 నుంచి 10వ తేదీ వరకు, అక్టోబరు 1 నుంచి 3వ తేదీ వరకు కనిపించే ఈ కమనీయ దృశ్యాన్ని చూసి తరించడానికి దేశం నలు మూలల నుం చి భక్తులు తరలి వస్తుంటారు. ఆదిత్యున్ని పాదాలను సుమారు ఐదు నిమిషాల పాటు సూర్యకిరణాలు తాకే దృశ్యం ఆలయ నిర్మాణ నైపుణ్యానికి దర్పణంగా నిలుస్తోంది. గాలిగోపురం మధ్య నుంచి సూర్యకిరణాలు ఆలయంలోకి ప్రవేశించి స్వామివారి పాదాలను తాకే దృశ్యాన్ని చూసి తరించాల్సిందే. ఆలయ వాస్తునిర్మాణం లోనే ఈప్రత్యేకత ఉంది. చాలా వరకూ ఆలయాలు ఉత్తరాభిముఖంగా ఉంటే ఈ ఆలయంలో మాత్రం ముఖద్వారం తూర్పునకు అభిముఖంగా ఉంటుంది.

అదిత్యారాధన అన్నింటికీ మాతృక...
sklmp1సూర్యభగవానుని ఆరాధన ను నిత్యం ఆచరిస్తే... వారికి మోక్షం లభిస్తుంది. సూ ర్యారాధనలోనే సకల దేవతారాధ నల మూలాలున్నాయి. రథసప్త మి రోజు అత్యంత శ్రేష్టమైన పర్వ దినం. ‘ఆరోగ్యం బాస్కరాధిచ్చేత్‌’ అన్ని జీవరాసులకూ ఆరోగ్యప్రదాత ఆదిత్యుడే... నిత్యం సూర్యనమస్కారాలు చేసేవారికి ఎటువంటి ఆనారోగ్య సమస్యలూ తలెత్తవు.
- ఇప్పిలి శంకర శర్మ,
అరసవల్లి ఆలయ ప్రధానార్చకులు


రథసప్తమి నాటి శిరస్నానం వేళ వరిచం వలసిన శ్లోకం..
శ్లో య దాజన్మకృతం పాపం మయా జన్మసు జన్మసు,
 తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమీ.
 ఏతజ్ఞన్మకృతం పాపం యచ్చ జనమంతరార్జితం,
 మనోవాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతేచ యే పునః
 ఇతి సప్తవిధం పాపం స్నానా న్మే సప్తసప్తికే!
 సప్తవ్యాధి సమాయుక్తం హర మాకరి సప్తమి.

జన్మజన్మాంతారాలో, మనోవాక్కాయాలతో, తెలిసీ, తెలియక చేసి న సప్తవిధ పాపాలవల్ల ఏర్పడిన రోగం, శోకం, మున్నగునవన్నీ ఓ లక్ష్మీకరమైన రథసప్తమీ! నిన్ను స్మరిస్తూ ఈ స్నానంతో నశించుగాక!

ప్రతీయేటా సూర్యదేవుని దర్శనం
sklmp3ప్రతీయేడాది రథసప్త మికి శ్రీకాకుళంలో ని అరసవల్లి వచ్చి సూర్య దేవుని దర్శనం చేసుకుం టున్నాను. సూర్యభగవా నుడే ఈ విశ్వమంతటికీ ప్రత్యక్ష దైవం. ఆయన వ లనే సకలజీవరాశులకూ చైతన్యం కలుగు తోంది. ఆయనని నిత్యమూ ఆరాధిస్తాను.
- కె. ఇందిర, గృహిణి,
బరంపురం (ఒడిషా)


రథసప్తమికి అన్ని ఏర్పాట్లు
sklmp2ఆదివారం జరగనున్న సూర్య జయంతోత్సవానికి (రథ సప్తమి) సంబంధించి అన్ని ఏ ర్పాట్లు పూర్తిచేసాం. ఆలయ అ నివెట్టి మండపంతో పాటు, ఆల య గోపురం, ముఖద్వారాలకు రంగులువేయించాం. ఇంద్రపు ష్కరిణి ఆవరణలో కర్రలతో ఉచిత క్యూలైన్లను ఏర్పాటు చేసాం. బ్లాకుల వారీగా క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నాం. భక్తులకు స్వామివారి ప్రసాదం లక్షకుపైగా లడ్లు అందించడానికి తయారు చేయిస్తున్నాం.
- ప్రసాద్‌ పట్నాయక్‌, ఈవో


ఆదిత్య హృదయం - పారాయణ
రామచంద్రుడు రావణుణ్ణి ఎలా వధించాలి అని చింతిస్తుండగా అగస్త్యుడు వచ్చి... భయాలు శత్రుపీడ తొలగడానికి, ఆరోగ్యం, విజయం, శుభం కలగటానికి ఇది చదువుకో అని ఆదిత్య హృదయన్ని భోదించాడు. అది చదివాక రాముడు రావణుణ్ణి అవలీలగా సంహరించగలిగాడట. విజయాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని తెచ్చిపెట్టే ఉత్తమోత్తమ గ్రంథరాజమని ఆనాడు అగస్త్యుడు రామ చంద్రునికి ఆదిత్య హృదయాన్ని చెబితే, దాన్ని వాల్మీకి భగవానుడు శ్రీరామాయణంలో అదించాడు.

sklmp17అది సూర్యుడి గురించి అందించిన స్తోత్రం కనుక సూర్యుడి ఆవిర్భావ దినం అయిన రథసప్తమి నాడు చేస్తే మంచిది. అది జరిగింది ఈ మాఘమాసంలో కనుక ఈ మాసం మొత్తం ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయ్యవచ్చు. మాఘమాసంలో పాడ్యమి మొదలుకొని అమావాస్య దాకా రోజూ సూర్యోదయానికి ముందే నిద్ర లేచి స్నానంచేసి, పాయసాన్ని తయారు చేసి, ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయడం, సూర్యుడికి పాయసాన్ని నివేదన చేసి నలుగురికి పంచడం చేస్తే మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందినవాళ్ళం అవుతాం. రాముడు లంకలో ఉన్న రావణుణ్ణి, కుంభకర్ణుణ్ణి సంహరించాడు. విభీషణుణ్ణి దగ్గరికి చేర్చుకున్నాడు.

రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు ఉన్న లంకానగరం వంటిదే మన శరీరం. మనలో రాజసిక, తామసిక, సాత్విక ప్రవృత్తులు ఉంటాయి. రాజసిక, తామసిక గుణములని అణిచివేయాలి, సాత్వికాన్ని పెంపొందించుకోవాలి. అదిత్యహృదయ పారాయణ వల్ల మనలో అంతర శత్రువులు అయిన రాజసిక, తామసిక ప్రవృత్తులని అణిచివేయగలుగుతాం.

సూర్య రథం ప్రత్యేకత
Devkaఅధితి, కశ్యపుల పుత్రుడు సూర్యుడు. సూర్యుడు బంగారు రథం ఎక్కి మేరు పర్వతం చుట్టూ తిరుగుతూ ఉంటాడు. సూ ర్యుడి బంగారు రథానికి ఒకే ఒక్కచక్రం ఉం టుంది. ఆ చక్రానికి ఆరు ఆకులు ఉంటా యి. రథానికి ఏడు గుర్రాలు ఉంటాయి. ఒక చక్రం సంవత్సరానికి, ఆరు ఆకులు ఆరు ఋతువులకి, ఏడు గుర్రాలు వారంలోని ఏడు రోజులకు, ఇంద్ర ధనస్సులోని ఏడు రంగులకు సంకేతంగా చెబుతారు. సర్వసాక్షీ భూతుడైన సూర్యభగవానుడు కాలానికి కర్త కనుక మన ప్రాచీనులు ఆ విషయాన్ని ఈవిధంగా ప్రతీకాత్మకంగా తెలియజేశారు.
సప్తాశ్వ రథమారూఢమ్‌ ప్రచండం కాశ్యపాత్మజమ్‌
శ్వేత పద్మ ధరం దేవమ్‌తం సూర్యం ప్రణమామ్యహమ్‌
సప్తాశ్వాల పేర్లు...
1. గాయత్రి
2. బృహతి
3. ఉష్ణిక్కు
4. జగతి
5. త్రిష్టుప్పు
6. అనుష్టుప్పు
7. పంక్తి

ఎంతో ఆనందదాయకం
sklmp4సూర్య భగవానుని ఆలయం మా శ్రీకాకుళంలో ఉండ డం ఎంతో ఆనందదాయకం. సూర్య జయంతి రోజున ఈ రాష్ట్రంలోని భక్తులే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు కూడా ఇక్కడికి వస్తుంటారు. సూర్య భగవానుని దర్శనం, ఆరాధన నిత్య జీవితంలో భాగం కావాలి. ఆయన ఆయురారోగ్యాలను ప్రసాదిస్తారు.
- కొమ్మాజోస్యుల వసంతకుమార్‌ (శ్రీకాకుళం)


రథసారధి అనూరుడు
అనూరుడు అనగా ఊరువులు (తొడలు) లేనివాడు అని అర్థం. ఇతడు కాళ్ళు, తొడలు లేకుండా పుట్టడం వల్ల అనూరుడనే పేరు వచ్చింది. అనూరునికే అరుణుడు (ఎర్రని వాడు) అని కూడా ఇంకొక పేరు ఉంది. ఇతడి తండ్రి కశ్యప ప్రజాపతి, తల్లి వినత. ఈమె సవతి కద్రువ. వినత, కద్రువ నెలలు నిండాక బిడ్డలకు బదులుగా గుడ్లను ప్రసవిస్తారు. వినతకు రెండు గుడ్లు పుడతాయి. కద్రువ కన్న గుడ్లు సకాలంలో పగిలి పిల్లలు బయటకు వస్తారు. వాళ్ళే నాగ సంతతి. ఇక ఎంతకాలం గడిచినా వినత కన్న గుడ్లు పగలకపోవడంతో...

లోపల అసలు పిల్లలున్నారో లేదో కూడా తెలియక వినత తల్లడిల్లిపో తుంది. ఇంకొకవైపు తన సవతిపిల్లలు కళ్ళముందు తిరుగుతూ ఉంటే ఆమె ఆత్రం పట్టలేక ఒక గుడ్డును పొడిచి చూస్తుంది. ఆ గుడ్డు లోపల కాళ్ళు ఇంకా ఏర్పడని నవయవ్వనుడైన కుమారుడు కనిపిస్తాడు. అతడే అనూరుడు. అతడు తనకు అలాంటి దుస్థితి కలిగించినం దుకు తల్లి మీద కోపించి వెయ్యేళ్ళపాటు సవతి ఐన కద్రు వకు దాసిగా ఉండమని శపిస్తాడు. రెండవ గుడ్డులో మహా బలాఢ్యుడైన గరుత్మంతుడు ఉన్నాడని, తొందరపడి ఆ గుడ్డును పగలగొట్టవద్దని చెబుతాడు. అప్పుడే సూర్యుడు వచ్చి అనూరుణ్ణి తన సారథిగా చేసుకుంటాడు. అనూరు డికి ఇక ఎప్పటికీ ఆ రథం దిగి నడవవలసిన అవసరం రాదు. తర్వాత కొంతకాలానికి రెండో గుడ్డును పగలగొట్టు కుని వచ్చిన గరుత్మంతుణ్ణి విష్ణువు తన వాహనంగా చేసు కుంటాడు. గరుత్మం తుడినే గరుడుడు అని కూడా అంటా రు. అనూరుడి భార్య శ్యేని. రామాయణంలో కీలకపాత్ర పోషించిన సంపాతి, జటాయువులు వీరి కుమారులు.

భాగ్యనగరంలో ఆదిత్యుడు!
HYDమన హైదరాబాద్‌లోనూ ఓ సూర్యదేవాల యం ఉన్నది. సికింద్రాబాద్‌లోని తిరుమల గిరిలో నిర్మిపబడిన శ్రీ సూర్య భగవాన్‌ దేవాల యం దిన దిన ప్రవర్ధమానమవుతూ అనేకమంది భక్తులనాకర్షిస్తున్నది. శ్రీ సూర్యశరణ్‌ దాస్‌ మహ రాజ్‌ సూర్య భగవానుని భక్తులు. శ్రీ సూర్య భగవా నుని ఆజ్ఞానుసారం శ్రీ సూర్య శరణ్‌ దాస్‌ 1959లో ఇక్కడి కొండ ప్రాంతంలో పచ్చని ప్రకృతి మధ్య సూర్య దేవుని ప్రతిష్టించి పూజించసాగారు. శ్రీ సూర్య శరణ్‌ దాస్‌ దేవాలయ నిర్మాణాన్ని తన భుజ స్కందాలపై వేసుకుని ఒక శక్తిగా ఆలయ నిర్మాణాన్ని పూర్తిచేశారు.

చిన్న గుట్ట మీద విశాలమైన ఆవరణలో నిర్మింపబడింది ఈ ఆలయం. గుట్ట ఎక్కి ఆలయ ప్రాంగణంలో ప్రవేశించగానే ఎడమపక్క కొండరాతిమీద మరకత గణపతి దర్శనమిస్తాడు. ఆయనకి నమస్క రించి కదిలితే ఎదురుగా ఒక పెద్ద రాతినానుకుని నిర్మింపబడిన చిన్న ఆలయంలో శ్రీ సూర్యనారాయణుడు అత్యంత సుందర రూపంతో దర్శనమిస్తాడు. పక్కనే అశ్వథ్థ, వేప చెట్లు కలిసివున్న వేదిక ఉంటుంది. భక్తులు ఇక్కడ దీపారాధన చేసి, ఆ దేవతా వృక్షాలకి ప్రదక్షిణలు చేసి భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లుతారు. ఈ వృక్షరాజాల పక్కనే ఆరుబయలే అత్యంత సుదరంగా వెలసిన శివలింగ దర్శనం మానసికానందాన్నిస్తుంది. పక్కనే సరస్వతీదేవి, నాగ దేవత, మరొక పక్క శ్రీ సత్యనారాయణ స్వామి ఉపాలయాలున్నాయి. నాగ దేవత ఆలయం వెనుకే నాగ విగ్రహాలున్నాయి.

దేవ్‌కా సూర్య దేవాలయం
దేవ్‌కా సూర్య దేవాల యం రాజస్థాన్‌లోని ఓ జిల్లాకేం ద్రమైన బార్మర్‌ పట్టణానికి 62 కి.మీ.ల దూరంలో ఉన్న దేవ్‌కా అనే చిన్న గ్రామంలో ఉన్నది. 13వ శతాబ్దానికి చెందిన ఈ దేవాలయం విశిష్టమైన శిల్ప సంపద కలిగి పర్యాటక ప్రదేశంగా ఉంది. ఇక్కడే విష్ణు దేవాలయం, మరో రెండు చిన్న దేవాలయాలు కూడా పర్యాటకులు చూడవచ్చు. వాటిలో ఒకటి గణేశ దేవాలయం.

మోఢేరా సూర్య దేవాలయం
Modheraగుజరాత్‌లోని అహ్మదాబాద్‌ నుంచి వంద కిలోమీటర్ల దూరంలోనున్న ‘పుష్పవతి’ నది ఒడ్డున ఈ దేవాలయం ఉంది. ఈ ఆలయాన్ని క్రీస్తు పూర్వం 1022-1063లో చక్రవర్తి భీమ్‌దేవ్‌ సోలంకి- నిర్మించారు. క్రీస్తు పూర్వం 1025- 1026 ప్రాంతంలో సోమనాథ్‌ మరియు చుట్టు ప్రక్కలనున్న ప్రాంతాలను విదేశీ ఆక్రమణ దారుడైన మహమూద్‌ హమద్‌ గజనీ తన ఆధీనంలోకి తీసుకున్నట్లు ఆ దేవాలయంలోని గర్భగుడిలో ఓ గోడపై లిఖించబడి ఉంది. గజనీ ఆ ప్రాంతాలను ఆక్రమించుకోవడంతో సోలంకీలు తమ పూర్వ వైభవాన్ని కోల్పోయారు. సోలంకి సామ్రాజ్యానికి రాజధానిగా చెప్పుకునే అహిల్‌వాడ్‌ పాటణ్‌ కూడా తన గొప్పతనాన్ని, వైభవాన్ని పూర్తిగా కోల్పోనారంభించింది.

తమ పూర్వవైభవాన్ని కాపాడుకునేందుకు సోలంకి రాచరికపు కుటుంబం మరియు వ్యాపారులు ఓ జట్టుగా ఏర్పడి అందమైన ఆలయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సోలంకి కుటుంబీకులు సూర్య వంశస్థులు. వారు సూర్యుడ్ని తమ కులదేవతగా కొలిచేవారు. కాబట్టి వారి ఆరాధ్య దైవమైన సూర్యుడ్ని కొలిచేందుకు ఓ అందమైన సూర్య మందిరాన్ని నిర్మించాలనుకున్నారు. ఈ విధంగా మోఢేరా సూర్యదేవుని ఆలయం నిర్మితమైంది.

కోణార్క్‌ సూర్యదేవాలయం
Konarkభారతదేశంలో ఎంతో ప్రఖ్యాతిగాంచిన సూర్యదేవాలయం... కోణార్క్‌ సూర్యదేవాలయం. ఒడిషా రాష్ట్రంలోని పూరీ క్షేత్రానికి 85 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ నల్ల గ్రానైటు రాళ్ళతో కట్టిన పదమూడవ శతాబ్దానికి చెందిన సూర్య దేవాలయం ఉంది. దీన్ని తూర్పు గంగ వంశానికి చెందిన నరసింహదేవుడు (1236 - 1264) నిర్మించాడు. ఈ ఆలయం ప్రపంచ వారసత్వ పరిరక్షిత ప్రదేశం. సూర్యుని రథం ఆకారంలో నిర్మించిన ఈ ఆలయం నగిషీలు చెక్కిన శిల్పాలతో అద్భుతంగా అలంకరించబడి ఉన్నది. ఈ ఆలయ సముదాయం మొత్తం ఏడు బలమైన అశ్వాలు, 12 జతల అలంకృత చక్రాలతో లాగబడుతున్న పెద్ద రథం ఆకారంలో కట్టబడింది. కోణార్క్‌లో సముద్ర తీరాన నిర్మించిన సూర్య దేవాలయం కలదు. సూర్య గమనమునకు అనుగుణంగా ఈ ఆలయ నిర్మాణం జరగటం అద్భుతాలలోకెల్లా అద్భుతంగా కనిపిస్తుంది. రథానికి పన్నెండు చక్రాలు, సంవత్సరానికి పన్నెండు మాసాలు, పన్నెండు రాసులు వీటి అనుగుణంగా సూర్యగమనం ఒక్కొక్క చక్రంలో ద్యోతకమవుతుంటుంది.


- బెందాళం క్రిష్ణారావు,
మేజర్‌ న్యూస్‌ ప్రతినిధి, శ్రీకాకుళం

5, ఫిబ్రవరి 2013, మంగళవారం

బొబ్బిలి వీణ

 బొబ్బిలి వీణ....భళారే..
1757లో బొబ్బిలి యుద్ధం జరిగిన తరువాత చిన్నాభిన్నమైన బొబ్బిలి సంస్థానం 1802 నాటికి కానీ కుదుటపడలేదు. రాజా రాయుడప్పారావు, శ్వేతా చలపతి రంగారావు తదితరులు పరిపాలనా పగ్గాలు చేపట్టిన తరువాతనే సంస్థానం మళ్లీ సంగీత, సాహిత్య సౌరభాలతో గుభాళించింది. వీరి కాలంలోనే ముఖ్యంగా వైణిక సంప్రదాయం విరాజిల్లింది. దాదాపు 300 సంవత్సరాల క్రితం ఆనాటి బొబ్బిలి సంస్థానాధీశులు మైసూరు సందర్శించారు. మైసూరు సంస్థాన దర్బార్‌లో వీణ కచేరి వినడం తటస్థించింది. ఆనాడు వీణ తయారీలో మైసూరు వడ్రంగులు ప్రత్యేతను చూపించేవారట. అది గమనించిన బొబ్బిలి రాజా తన సంస్థానంలోని ఇద్దరు వడ్రంగులను మైసూరు పంపించి వీణల తయారీలో మెళకువలు నేర్చుకోవాలని ప్రోత్సహించారు. అదే వీణ తయారీలో బొబ్బిలి రాణించడానికి అంకురార్పణ అరుుంది.

Untitle1980లో బొబ్బిలి వీణకు జాతీయ అవార్డు లభించింది. సర్వసిద్ధి వీరన్న వీణల తయారీలో ఉత్తమ వృత్తి కళాకారునిగా అప్పటి రాష్టప్రతి నీలం సంజీవరెడ్డి నుంచి అవార్డు అందుకున్నారు. ఆనాడు మయూరి వీణను రూపొందించడం తన ఆశయంగా వీరన్న ప్రకటిం చారు. 2000 సంవత్సరంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ బొబ్బిలి వీణకు మురిసిపోయి సర్వసిద్ధి వెంకట రమణను వైట్‌హౌస్‌కు రావలసిందిగా ఆహ్వానించడం చెప్పుకోదగినది. ఈమని శంకర శాస్ర్తి వంటి ఎందరో వైణిక విద్వాంసులు బొబ్బిలి వీణలకు ప్రాధాన్యం ఇచ్చేవారు. ఎంత ఘన చరిత్ర కలిగినా, ఇప్పుడు ఈ వృత్తిపని వారి మనుగడ ఒడుదుడుకులను ఎదుర్కొంటున్నది. దీనికి కారణం వీణల తయారీకి కావలసిన పనస, సంపెంగ చెట్ల కలప సరిగ్గా లభించక పోవడం. అటవీ శాఖ ఆంక్షలు విధించడం కూడా మరొక కారణం.

ఇప్పుడు మామూలుగా వాయించే వీణలకన్నా, బహుమతులుగా ఇచ్చే చిన్న వీణలకు ఎంతో గిరాకీ ఉంది. ఏటా 300 వరకూ పెద్ద వీణలు బొబ్బిలిలో తయారవుతుంటాయి. విజయనగరం జిల్లా బొబ్బిలితోపాటు బాదంగి మండలం వాడాడలో కూడా వీణలను తయారు చేసే కుటుంబాలు సుమారు 45 వరకూ ఉన్నాయి. వీరు నెలకు 400 వరకూ గిఘ్ట వీణలను రూపొందిస్తు న్నారు. ఈ వీణలను లేపాక్షి సంస్థ మార్కెటింగ్‌ చేస్తోంది.గిఫ్ట్‌ వీణ తయారు చేయాలంటే రెండు రోజులు పడుతుంది. ఒక్కొక్క గిఫ్టు వీణపై 400 రూపాయిల వరకూ ఆదాయం వస్తుంది. ఇందులో వంద రూపాయిలు పెట్టుబడిగా పోతుంది. అలాగే పెద్ద వీణకు 4 వేల రూపాయిలు పెట్టుబడి పెడితే 5 వేల రూపాయిల వరకూ ఆదాయం వస్తుంది. విదేశాలకు ఈ వీణలు ఎగుమతి అవుతుంటాయి. ఏటా 14 లక్షల రూపాయిల వరకు టర్నోవర్‌ ఉంటుంది.

కాగా ఆ మధ్య బొబ్బిలి వీణలను టోకున కొనుగోలు చేసి హరిదాసులకు పంపిణీ చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేసింది. ఈ కాంట్రాక్టును హస్తకళల కేంద్రం వారు చేపట్టి సుమారు 400 వీణలను తయారుచేయించి తిరుమలకు పంపించారు. కొన్నాళ్ల పాటు ఈ పనులు వీణ తయారీ కార్మికు లకు ఉపాధి కల్పించాయి. తంబురా ఆకారంలో ఉన్న ఈ వీణలను చూసిన తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంది, అధికారులు ఎంతో ముచ్చటపడ్డారని కళాకారులు ఇప్పటికీ చెబుతుంటారు.మన రాష్ట్రానికి ఎలాంటి విశిష్ట అతిథి వచ్చినా వారికి ఇచ్చే విలువెన బహుమతి బొబ్బిలి వీణే. ఇలా అందుకున్న నాటి అమెరికా అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ వీణ మలిచిన తీరుకు అబ్బురపడి ఇక్కడి కార్మికులను వైట్‌హౌస్‌కు రావాల్సిందిగా ఆహ్వానించారు. ఇది బొబ్బిలికి దక్కిన అరుదైన గౌరవంగా చెప్పుకుంటారు.

బొబ్బిలితో పాటు వివిధ గ్రామాల్లో వీణలు తయారు చేసి అమ్ముతున్న కళాకారులను ఒక్కచోటకు చేర్చి తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలనే ఆలోచన 2001లో ప్రభుత్వానికి వచ్చింది. గొల్లపల్లిలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ‘రాష్ట్ర హస్త కళల సంస్థ’ ద్వారా వీణలను కొనుగోలు చేసేందుకు నిర్ణయించింది. దీంతో సుమారు 200 మంది కార్మికులు ఈ కేంద్రంలో చేరారు. అయితే పనస కలప కొరతతో అందరికీ చేతినిండా పనిదొరికే పరిస్థితి కనిపించడంలేదు. కలపను అవసరమెనంత మేర అందించేందుకు వీలుగా పనస వనాలను పెంచేలా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ఇచ్చిన హామీలు నేటికీ నెరవేరలేదు. చేవగల కలప దొరకక పోవడంతో ఒడిశా తదితర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. దీంతో పెట్టుబడి ధర రెండింతల వుతోందని కార్మికులు వాపోతున్నారు. అదీగాక హస్తకళల సంస్థ కొనుగోలు చేస్తున్న ధరకు, బయటి మార్కెట్‌ ధరకు భారీ వ్యత్యాసం ఉంటోంది. ఒక్కో వీణకు సుమారు రూ. 2 వేలు వరకు లాభం వస్తుందని ఆశపడే కార్మికులకు నష్టమే ఎదురవుతోంది.

పిండికొద్దీ రొట్టె చందంగా ఇక్కడి వీణలు ధరను బట్టి మోగుతాయి. స్వరాలు పలికించే వివిధ ఆకృతుల వీణలు రూ.9 వేల నుంచి రూ.16 వేల వరకు ఉన్నాయి. సంగీతంలో ప్రవేశం ఉన్నవారు మాత్రమే ముందుగా ఆర్డరిచ్చి వీటిని చేయించుకుంటారు. ఇక బహుమానాలకు ఇచ్చే వీణలు రూ.400 నుంచి రూ. 2 వేల మధ్య ధర పలుకుతాయి. తయాఆయనలో అంతర్లీనంగా రచయిత కూడా ఉన్నారు. ఇన్ని కళలను ఒక్కడే అభ్యసించడం ఆశ్చర్యకరమే. తాడేపల్లికి చెందిన శ్రీనివాసవర్మ విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో కొంతకాలం పనిచేశారు. మొదట్లో ఇంద్రజాలికునిగా కొన్ని ప్రదర్శనలు ఇచ్చారు. ప్రముఖ మెజీషియన్లు భయంకర్‌, పరుశురామ్‌ల పర్యవేక్షణలో శిక్షణ మొదలుపెట్టారు. చేయి తిరిగిన ఇంద్రజాలి కునిగా వారివద్ద అశేష అనుభవం గడించారు.

Unt2ఒక్కో ప్రదర్శనలో దాదాపు 40కి పైగా అద్భుతమైన ఐటమ్‌లు ప్రదర్శించేవారు శ్రీనివాసవర్మ. విజయవాడ, హైదరాబాద్‌, ఏలూరు, కైకలూరు, భీమవరం వంటి ప్రాంతా లలో పలు ప్రదర్శనలు చేసి ప్రశంసలు పొందారు. ప్రఖ్యాత రామోజీ ఫిలింసిటీలో మెజీషియన్‌ ప్రదర్శనలిచ్చే ఉద్యోగిగా కొంతకాలం చేశారు. అలాగే మౌంట్‌ ఒపేరా ఎమ్యూజింగ్‌ పార్కులో కూడా ఒక నెలరోజులు ఈయన చేసే సాహసోపేతమైన హర్రర్‌ ట్యూబ్‌లైట్‌ ఫీట్‌ (ట్యూబు లైట్‌ని నమిలి గాజుపెంకులుగా చేయడం), నోట్లో కిరోసిన్‌ పోసుకుని మంటలు ఊదుతూ భయోత్పాతం కలిగే రీతిలో ఆనందంగా నృత్యం చేయడం కేవలం అతనికే సాధ్యమయింది. ఒక్కో సారి ఈ సాహస కృత్యాల ఫీట్‌లో తన ఒంటికి గాయం అయినా అవన్నీ లెక్కచేయని తత్వం ఆయనది. తాను చేసే సాహసకృత్యాలలో ప్రమాదం పొంచి ఉన్నా ప్రేక్షకులు వినోదంతో అందించే ఉత్సాహపూరితమైన చప్పట్లే తనకు ప్రోత్సాహం ఇస్తాయంటారు.

త్వరలో హైదరాబాద్‌ త్యాగరాయగాన సభలో జరిగే కార్యక్రమంలో తన ప్రదర్శనలు ఇస్తానంటున్నారు శ్రీనివాసవర్మ. కేవలం కళనే నమ్ముకుని ఒంటిపై గాయాలను కూడా లెక్కచేయకుండా పొట్టకూటికోసం చేసే విన్యాసాలకు ఏనాటికైనా ప్రభుత్వ గుర్తింపు రాకుండా ఉంటుందా అని ఎదురుచూస్తున్నారు ఆయన.
రీ, అమర్చే గాజుపెట్టె ... ఇలా హంగులన్నింటికీ కలిపి ధర నిర్ణయిస్తారు.

(సూర్య నుంచి)

2, ఫిబ్రవరి 2013, శనివారం

గరిమెళ్ళ

గరిమెళ్ళ సత్యనారాయణ


శ్రీకాకుళంలోని గరిమెళ్ళ సత్యనారాయణ విగ్రహం.
గరిమెళ్ళ సత్యనారాయణ విగ్రహం క్రిందనున్న సమాచార ఫలకం.
 
స్వాతంత్ర్యోద్యమ కవుల్లో గరిమెళ్ళ సత్యనారాయణది విశిష్టమైన స్థానం. గరిమెళ్ళ గేయాలు జాతీయ వీరరసంతో తొణికిసలాడుతూ పాఠక జనాన్ని ఉర్రూతలూగించాయి. అతను వ్రాసిన ' మా కొద్దీ తెల్ల దొరతనం .... " పాట సత్యాగ్రహులకు గొప్ప తెగువను, ఉత్తేజాన్ని కలిగించింది. అలాగే " దండాలు దండాలు భారత మాత ' అనే గీతం కూడా ప్రజలను ఎంతగానో జాగృతం చేసి స్వాతంత్ర్య ఉద్యమంలోకి ఉరికే తెగువను కలగజేసింది. దేశభక్తి కవితలు వ్రాసి జైలుశిక్ష అనుభవించిన వారిలో ప్రధముడు గరిమెళ్ళ. నిజాయితీకి, నిర్భీతికి గరిమెళ్ళ మారుపేరుగా నిలిచాడు. మాకొద్దీ తెల్ల దొరతనం పాట ఆనాడు ప్రతి తెలుగు వాడి నోటా మార్మోగేది. ఆయనంత ప్రసిద్ధినొందిన జాతీయకవి ఆ రోజుల్లో మరొకరులేరు. తెలుగునాట జాతీయ కవిత్వానికి ఒరవడి పెట్టిన కవి ప్రముఖుడు గరిమెళ్ళ.

తొలి జీవితం

గరిమెళ్ళ సత్యనారాయణ శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తాలుక గోనెపాడు గ్రామంలో 1893 జూలై 14న జన్మించాడు. తల్లి సూరమ్మ, తండ్రి వేంకట నరసింహం. గరిమెళ్ళ ప్రాధమిక విద్య స్వగ్రామమైన ప్రియాగ్రహారంలో సాగింది. విజయనగరం, మచిలీపట్నం, రాజమహేంద్రవరం మొదలైనచోట్ల పైచదువులు చదివాడు. బి.ఏ. చేశాక గంజాం కలెక్టర్ కార్యాలయంలో గుమస్తాగా కొంతకాలం పనిచేశాడు. ఆ తరువాత విజయనగరం ఉన్నత పాఠశాలలో ఉపాథ్యాయుడిగా కొంతకాలం పనిచేశాడు. గరిమెళ్ళ చిన్నప్పుడే మేనమామ కూతుర్ని వివాహం చేసుకున్నాడు. అతని స్వేచ్ఛాప్రియత్వం వల్ల ఎక్కువకాలం ఏ ఉద్యోగమూ చెయ్యలేకపోయాడు.

జాతీయోద్యమ స్ఫూర్తి

1920 డిసెంబర్‍లో కలకత్తాలో జరిగిన కాంగ్రెసు మహాసభలో సహాయనిరాకరణ తీర్మానం అమోదించబడింది. ఆ వీరావేశంతో ఉద్యమంలోకి దూకిన గరిమెళ్ళ ' మా కొద్దీ తెల్లదొరతనం పాటను వ్రాశాడు. ఆనాటి రోజుల్లో రాజమండ్రిలో ఈ పాట నకలు కాపీలు ఒక్కొక్కటి బేడా ( 12 పైసలు) చొప్పున అమ్ముడు పోయేవట. ఆనోటా- ఈనోటా ఈ పాట గురించి ఆనాటి బ్రిటీషు కలెక్టరు బ్రేకన్ చెవినపడి ఆయన గరిమెళ్ళను పిలిపించి పాటను పూర్తిగా పాడమన్నారట. గరిమెళ్ళ కేవలం రచయితే కాదు , గొప్ప గాయకుడు కూడా. తన కంచు కంఠంతో ఖంగున పాటలు కూడా పాడగలడు. గరెమెళ్ళ పాట విన్న బ్రిటీషు కలెక్టరు తెలుగుభాష నాకు రాకపోయినప్పటికీ, ఈ పాటలో ఎంతట మహత్తర శక్తి ఉందో , సామాన్య ప్రజల్ని సైతం ఎలా చైతన్యపర్చగలదో నేను ఊగించగలనన్నాడట. ఆ పాటను వ్రాసినందుకు గరిమెళ్ళకు ఒక సంవత్సరం కఠిన కారాగార శిక్ష విధించారు. ఆ రోజుల్లో కాంగ్రెసు స్వచ్ఛంద సేవకులు ఖద్దరు దుస్తులు ధరించి, గాంధీటోపి పెట్టుకుని, బారులు తీరి మువ్వన్నెల జెండా ఎగరవేసుకుంటూ.
మాకొద్దీ తెల్లదొరతనం- దేవ
మాకొద్దీ తెల్లదొరతనం అంటూ
ఆకాశం దద్దరిల్లేలా పాడుతూ వీధుల్లో కవాతు చేసేవారట.
శిక్షపూర్తి చేసుకుని జైలు నుంచి విడుదల అయిన గరిమెళ్ళ మళ్ళీ ప్రజల మధ్య గొంతెత్తి పాడసాగాడు. ప్రజల్ని ఎంతగానో ఆకట్టుకోసాగాడు. ఇది చూసి ప్రభుత్వాధికారులు భయపడ్డారు. గరిమెళ్ళ బయట వుండటం ప్రభుత్వాధికారులు భయపడ్డారు. గరిమెళ్ళ బయట వుండటం ప్రభుత్వానికి మంచిది కాదని భావించి ఆయనను అరెస్టు చేశారు. కాకినాడ మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచారు. మేజిస్ట్రేట్ రెండు సంవత్సరములు కఠిన కారాగార శిక్ష విధించాడు. గరిమెళ్ళ జైలులో వుండగా 1923 జనవరిలో ఆయన తండ్రి చనిపోయాడు. క్షమాపణ చెబితే ఒదులుతామని చెప్పారట. కాని గరిమెళ్ళ క్షమాపణ చెప్పకుండా జైలులోనే వున్నాడు. అంతటి దేశ భక్తుడు ఆయన.

బతుకు పుస్తకం

జైలు నుంచి విడుదల కాగానే ప్రజలు ఆయనకు ఎన్నోచోట్ల సన్మానాలు చేశారు. ఆయన జీవితంలో మధుర ఘట్టం ఇదొక్కటే. ఆ తరువాత కొద్దిరోజులకు భార్య చనిపోయింది. అప్పుడాయనకి ఇద్దరు కుమార్తెలు. గరిమెళ్ళ మళ్ళీ పెళ్ళి చేసుకున్నాడు. అప్పులు పెరగడంతో వున్న ఆస్తి అమ్మేసి అప్పులు తీర్చాడు. ఉద్యోగం వదిలేశాక కొంతకాలం ప్రియాగ్రహారంలో గ్రంథాలయ కార్యదర్శిగా పనిచేశాడు. శ్రీ శారదా గ్రంథమాల స్థాపించి పద్దెనిమిది పుస్తకాలు అచ్చువేశాడు. అవి అమ్ముడుపోలేదు. ఆయన ఎక్కువగా రాజమండ్రి, విజయవాడ, మద్రాసులకు తిరుగుతూ వుండడంతో, వాటిని పట్టించుకోక పోవడం వల్ల వాటిని చెదలు తినేశాయి. వాటి వల్ల కూడా కొంత నష్టం వచ్చింది.

రచనలు

1921 లో గరిమెళ్ళ ' స్వరాజ్య గీతములు ' పుస్తకం వెలువడింది. 1923లో హరిజనుల పాటలు, 1926లో ఖండకావ్యములు, భక్తిగీతాలు , బాలగీతాలు మొదలైన రచనలు వెలువడ్డాయి. గరిమెళ్ళ చాలాసార్లు జైలు శిక్ష అనుభవించాడు. జైలులో వుండగా తమిళ, కన్నడ భాషలు నేర్చుకున్నాడు. తమిళ, కన్నడ గ్రంథాలను తెలుగులోకి అనువదించాడు. ఆంగ్లంలో కూడా గరిమెళ్ళ కొన్ని రచనలు చేశాడు. ఆంగ్లం నుంచి కొన్ని గ్రంథాలను తెలుగులోకి అనువదించాడు. భోగరాజు పట్టాభిసీతారామయ్య ఆంగ్లంలో వ్రాసిన ' ది ఎకనామిక్ కాంక్వెస్ట్ ఆఫ్ ఇండియా' అనే గ్రంథాన్ని తెలుగులోకి అనువదించాడు. గరిమెళ్ళ జీవనోపాధి కోసం 1933లో మద్రాసు చేరుకున్నాడు. అక్కడ గృహలక్ష్మి పత్రిక సంపాదకుడుగా ఉద్యోగంలో చేరాడు. కొంతకాలం తరువాత అక్కడ మానివేసి ఆచార్య రంగా, వాహిని పత్రికలో సహాయ సంపాదకుడుగా చేరాడు. కొద్ది రోజులతర్వాత ఆంధ్రప్రభలో చేరాడు. కొంతకాలం ఆనందవాణికి సంపాదకుడుగా పనిచేశాడు. కొంతకాలం ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా జీవనం సాగించాడు.

చివరిదశ

గరిమెళ్ళ పేదరికం అనుభవిస్తున్న రోజుల్లో దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు కొంత సహాయ పడ్డాడు. వావిళ్ళ వేంకటేశ్వర శాస్త్రులు ప్రతినెలా ఆయనకు ఆర్థిక సహాయం చేసేవాడు. వివిధ పత్రికలకు, ఆలిండియా రేడియోకి రచనలు చేసి కొంత గడిస్తున్నా ఆయన అవసరాలకు ఆ డబ్బు చాలలేదు. ఒకవైపు పేదరికం, మరోవైపు అనారోగ్యం ఆయనను బాగా దెబ్బతీశాయి. చివరిదశలో ఒక కన్నుపోయింది. పక్షవాతం వచ్చింది. దిక్కులేని పరిస్థితుల్లో కొంతకాలం యాచన మీద బ్రతికాడు.
స్వాతంత్ర్యానంతరం మన పాలకుల వల్ల కూడా గరిమెళ్ళకు చెప్పుకోదగ్గ సహాయం లభించలేదు. దాంతో కొంతమంది మిత్రులు గరిమెళ్ళను ' మాకొద్దీ నల్ల దొరతనం ' అనే గేయం వ్రాయలని అడిగారట. దేశ భక్తుడు, స్వాతంత్ర్య పిపాసి అయిన గరిమెళ్ళ అందుకు అంగీకరించలేదుట. చరమ దశలో దుర్భరదారిద్ర్యాన్ని అనుభవించిన గరిమెళ్ళ 1952 డిసెంబర్ 18వ తేదీన మరణించాడు. ఆయన అంత్యక్రియలు ఇరుగు పొరుగు వారు జరిపారు.

గిడుగు వేంకట సీతాపతి

మనుమడి చమత్కార వివరణ














          డాక్టర్ గిడుగు వేంకట సీతాపతి 
సంస్కృత భాషలోనికి –అనువదించినట్టి  
అనగా సంస్కృతీకరణ చేయబడిన
తెలుగులో రచించబడిన కావ్య, ప్రబంధాలలో 
అనేక మేలి రతనాలు ఉన్నవి.
వాటిని –“ కవితోదయ చంద్రిక “గా వెలువరించారు.
"నాహం సంస్కృత పండితః, న చ కవిః
కింత్వేష యత్నః కృతః
విజ్ఞాతుం బహుమాని తాంధ్ర కవితా
మాధుర్య మాంధ్రేతరే
కాంక్షంతీతి భ్రంశం విచింత్య కతిచి
త్పద్యాని గేయా న్యహం
ప్రీత్యా సంస్కృత భాష యా వ్యర చయం
మా మాద్రి యాంతాం చుదాః.”
అంటూ సవినయంగా మనవి చేసుకున్న నిగర్వి గిడుగు సీతాపతి.
గిడుగు సీతాపతి భీముని పట్నంలో 
 
1885 జనవరి 28 వతేదీన జన్మించారు.
ఆతని తండ్రి వేంకట రామ మూర్తి గారిది  పర్లాకిమిడిలో మాస్టారు గిరీ.
కావున  గిడుగు సీతాపతి బాల్యం పర్లాకిమిడిలో గడిచింది.
నాయనమ్మ ఈ మనవడిని,
చిన్నారి బుడుగు లాంటి  గిడుగు సీతాపతిని,
 
ఒళ్ళో కూర్చుండ బెట్టుకుని,
తనకు వచ్చిన పద్యాలూ, పాటలూ చెబుతూండేది.
ఒకసారి ఆవిడ ఒక పద్దెం (poem) చెప్పింది.
“చింతా మణి యను బ్రాహ్మడు;
పంతానికి గోడ మీద షట్ మని వ్రాసెన్;
అంతట వర్షము కురిసెను;
కంటి మీద కాకర పూసెన్.”
ఆమె కుమారుడు వేంకట రామమూర్తి,అనగా గిడుగు తండ్రి
“ తలా తోకా లేని ఇలాంటి పద్యాలేమిటి?! ” 
 
అంటూ విసుక్కునే వారు.
అప్పుడు చిన్నారి గిడుగు సీతాపతి ఇలా వివరణ చేసారు.
“ అలా కాదు నాన్నారూ!
గోడ మీద కాంతా మణి పటం మీద వాన పడింది.
అప్పుడేమో ఆ బొమ్మ కన్ను తడిసింది.
అందులో నీటి చుక్క ఒకటేమో కాకర పువ్వు ఐనదన్న మాట! ”
అంటూ ఆ టీకా టిప్పణి తో పితామహిని సమర్ధించాడు.
మనవడి అర్ధ తాత్పర్యాలూ,
ఆ చిన్నారి పాండిత్య ప్రతిభకు దర్పణం అవడంతో
ఆమె ఉప్పొంగిపోయిందని వేరే చెప్పాలా!
                { యువభారతి ప్రచురణలు  1975
                             తిరుమల రామ చంద్ర “మరపురాని మనీషి” }
             

            మనుమడి చమత్కార వివరణ (తెలుగురత్న) ఈ పోస్టు ఇదివరకే కోణమానిని తెలుగు ప్రపంచం బ్లాగులో ఉంది